పాలనా వికేంద్రీ కరణను స్వాగతించిన భాజపా

పాలనా వికేంద్రీ కరణను స్వాగతించిన భాజపా

అమరావతి : పాలనా వికేంద్రీ కరణను భాజపా సభ్యుడు సోము వీర్రాజు బుధవారం ఎగువ సభలో సమర్థించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ముసాయిదాపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘గత ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారు. ఆరోపించారు. గతంలో ప్రధాని మోదీ బొమ్మను గాడిదతో తన్నించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని విషయంలో ఆయన జోక్యం కోరుతున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగింది. రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబు అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించారు. ఆ తప్పిదం వల్లే ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. కర్నూలును రాజ ధానిగా స్వాగతిస్తున్నాం. ఈ ముసాయిదాలో ప్రాంతీయ బోర్డులు ఉన్నాయ’ని తెలిపారు. బందరు రేవు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావటాన్నిస్వాగతిస్తున్నాం. కాపులు ఉద్యమిస్తే కేసులు బనాయించిన చరిత్ర తెదేపాది. కాపు ఉద్యమం అణిచి వేతకు గత ప్రభుత్వం ముద్రగడ స్వగ్రామంలో 3500 మంది పోలీసులను మోహరించింది. నారా లోకేశ్ చెప్పిన తెదేపా అభి వృద్ధి వివరాల్లో 70 శాతం కేంద్రం నిధులతో చేసినవే. చంద్రన్న బాట పేరుతో రాష్ట్రంలో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కేంద్రం నిధులతో వేసినవేన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos