మోదీ అభినవ సుయోధనుడు

మోదీ అభినవ సుయోధనుడు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భారతంలో దుర్యోధనుడిలా, ఆ అహంకారమే ఆయన ఓటమికి కారణమవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. హర్యానాలోని అంబాలాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి భాజపా తమ ప్రసంగాల్లో ఒక్కసారి కూడా ప్రస్తావించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. కేవలం అమరవీరుల పేరుతోనో, మా కుటుంబానికి చెందిన అమర వీరుడు (రాజీవ్ గాంధీ) పేరుతోనే వాళ్లు ఓట్లడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల బాధలు వినే ఓపిక మోదీకి లేదని తప్పుబట్టారు. ‘ఈ ఎన్నికలు కేవలం ఒక కుటుంబానికి చెందినవి కావు. మోదీ సారథ్యంలోని భాజపా ప్రభుత్వ వైఫల్యాలకు ఎన్నికల’ వ్యాఖ్యానించారు. మోదీని ప్రియాకం దుర్యోధనుడిగా అభివర్ణించటాన్నిభాజపా అధ్యక్షుడు అమిత్షా ఖండించారు. ఎవరు అర్జునుడో, ఎవరు దుర్యోధనుడో మే 23న తేలుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos