ఆసుపత్రి నుంచి అనుమానితుడు అదృశ్యం

ఆసుపత్రి నుంచి అనుమానితుడు అదృశ్యం

గుంటూరు: ఇక్కడి సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితుడు అదృశ్యం కావడం కలకలాన్ని రేపింది. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కుటుంబ సభ్యలు ఈ నెల 25న సర్వజనాసుపత్రిలో చేర్పించారు. జీజీహెచ్ వైద్యులు అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షి స్తున్నారు. గురువారం ఆ వ్యక్తి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆసుపత్రి వర్గాలు కంగుతిన్నాయి. వెంటనే ఆస్పత్రి వైద్యాధికారి ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసారు.బాధితుడి కోసం గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos