అందుకే సారీ చెప్పా..

అందుకే సారీ చెప్పా..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది.సుశాంత్ చనిపోయాడని తెలియగానే షాక్ కు గురయ్యా.. ఏం జరిగిందో అర్థం కాలేదు. మార్చురీ దగ్గరకు వెళ్లాను. అక్కడ తనను రానీయలేదు. కేవలం సుశాంత్ శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు 3-4 సెకండ్లు మాత్రమే చూశాను అంటూ రియా వాపోయింది. నా స్నేహితులు వారిని ప్రాధేయపడ్డా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఇక సుశాంత్ మరణం తనను కలిచివేసిందని ‘సారీ బాబు’ అంటూ రియా వాపోయింది. తను మరణించాడని.. జీవితాన్ని కోల్పోయాడని.. కానీ అతడి మరణాన్ని జోక్ లా చేశారని రియా ఆవేదన వ్యక్తం చేసింది. క్షమించమని కోరడం తప్ప నేను ఏమీ చేయలేనని.. అతడి పాదాలను తాకానని.. ఏ భారతీయుడైనా దీన్ని అర్థం చేసుకోవాలని రియా తెలిపింది.ఇదిలా ఉంటే సిబిఐ విచారణలో సుశాంత్ స్నేహితుడు అయిన సిద్దార్థ్ పితానీ పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు డ్రగ్స్ కోణం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద పని చేసిన ఒక వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు.జనవరి వరకు సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు లేదని అతను తెలిపాడు. సుశాంత్ జీవితంలోకి రియా చక్రవర్తి వచ్చిన తర్వాత అతనికి డ్రగ్స్ ఇవ్వడం జరిగిందని… అతను డ్రగ్స్ తీసుకునేలా చేసిందని చెప్పాడు. అయితే డ్రగ్స్ కు సుశాంత్ బానిస కాలేదని తెలిపాడు. సుశాంత్ కు మందు తాగడం, సిగరెట్లు కాల్చే అలవాటు మాత్రం ఉన్నాయని చెప్పాడు.ఓ సినిమా షూటింగ్ లో సుశాంత్, రియా కలుసుకున్నారని… ఆ తర్వాత రిలేషన్ షిప్ లో ఉన్నారని అతను తెలిపాడు. సుశాంత్ జీవితాన్ని రియా తన చేతుల్లోకి తీసుకుందని… సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos