హోసూరు ఎమ్మెల్యే సత్య సుడిగాలి పర్యటన

హోసూరు ఎమ్మెల్యే సత్య సుడిగాలి పర్యటన

హోసూరు : స్థానిక కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే సత్య క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోసూరు కార్పొరేషన్ పరిధిలోని ముల్లైనగర్, కడవుల్ నగర్, వివోసి నగర్, కలైనర్ నగర్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే ఆకస్మికంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే సత్య దృష్టికి తీసుకెళ్లారు. కడవుల్ నగర్, వివోసి నగర్ తదితర ప్రాంతాలలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోసూరు కార్పొరేషన్ అధికారులు, డిఎంకె పార్టీ ప్రముఖులు ఆయన వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos