సుప్రియానూ సతాయించిన ట్యాక్సీ డ్రైవర్‌

సుప్రియానూ సతాయించిన ట్యాక్సీ డ్రైవర్‌

ముంబై :మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్సభ సభ్యురాలు సుప్రియా సులే శుక్రవారం ఇక్కడి దాదర్ స్టేషన్లో చేదు అనుభ వాన్ని చవి చూసారు. ట్యాక్సీ కావాలాని వ్యక్తి దాదర్ స్టేషన్లో ఏకంగా ట్రైన్లోకి ఎంటరై తమను సతాయించాడని ట్వీట్ చేశారు. కుల్జీత్ సింగ్ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీఅవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంట పడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని దాదర్ స్టేషన్ రైల్వే అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.దరిమిలా మల్హోత్రాను పోలీసులు అదు పులోనికి తీసుకుని జరిమానా విధించారు. దీంతో వారికి సుప్రియా ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్ల రైల్వే ప్రయాణీకులకు అసౌకర్యం వాటిల్ల రాదని ఆశించారు. ప్రయాణీకులకు ఇలాంటి అనుభవం ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఆటో డ్రైవ ర్లు తమ సేవలపై ప్రచారం చేసుకునేందుకు అనుమతించరాదని రైల్వే మంత్రిత్వ శాఖకు విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos