అమరావతి:రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈ వారం మరింత మండిపోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని వివరించారు. కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44-46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దరిమిలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.