మండనున్న ఎండలు

మండనున్న ఎండలు

అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. ఈ నెల పది వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ అధికార్లు తెలిపారు. మంగళ వారం మధ్యాహ్నం 11.30 గంటల వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల 43 నుంచి 45డిగ్రీలు దాఖలైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు జల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా, 9 మండలాల్లో 43 డిగ్రీలు, 19 మండలాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos