హైదరాబాదు: నిజామాబాద్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ బుధవారం రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో ప్రకాష్, సబ్ ఇన్స్పెక్టర్ మధ్య గత రెండు, మూడు వాగ్వివాదం సాగుతోంది. బుధవారం ఉదయం కూడా అది పునరావృతమైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రకాశ్ ఎస్సై రివాల్వర్ తీసుకుని తనను తాను కాల్చుకున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.