గాంధీనగర్ : స్వీయ నిర్బంధంలో ఉన్న పారిశ్రామికవేత్త వినోదాబాయ్ (44) ఆత్మహత్య చేసుకోవడం కలకలాన్ని రేపింది. వినోదాబాయ్కి కరోనా లక్షణాలతో కనిపిండంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రోగం సోకనట్లు తేలినప్పటికీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. 13 రోజుల పాటు నిర్బంధంలో కొనసాగిన ఆయన శనివారం రాత్రి ఇంటి సీలింగ్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్డౌన్ వల్ల వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.