రక్తచరిత్ర,బాహుబలి,ఈగ
తదితర చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో కిచ్చ సుదీప్పై
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు కోర్టు జామీను రహిత అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గతంలో
ఓ రియాలిటీ షో కోసం సుదీప్కు చెందిన కిచ్చ క్రియేషన్స్ చిక్కమగళూరులోని ఓ కాఫీ ఎస్టేట్లో
షూటింగ్ జరిపింది.ఆ సమయంలో రూ.1.80 కోట్లు పారితోషకంగా ఇస్తామంటూ కాఫీ ఎస్టేట్తో
కిచ్చ క్రియేషన్స్ ఒప్పందం చేసుకుంది.అప్పట్లో కేవలం రూ.50వేలు మాత్రమే చెల్లించిన
కిచ్చ క్రియేషన్స్ మిగిలిన పారితోషకం గురించి స్పందించకపోవడంతో కాఫీ ఎస్టేట్ యజమాని
దీపక్ కిచ్చ క్రియేషన్స్తో పాటు డైరెక్టర్ మహేశ్పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే
ఇది సివిల్ పరిధిలోకి వస్తుందంటూ పోలీసులు సూచించడంతో కాఫీ ఎస్టేట్ యజమాని కోర్టును
ఆశ్రయించాడు. ఒప్పందాన్ని అతిక్రమించి కాఫీతోటను ధ్వంసం చేయడమే కాకుండా పారితోషకం చెల్లించమని
అడిగినందుకు తనను బెదిరించారని తనకు న్యాయం చేయాలంటూ యజమాని దీపక్ కోర్టుకు మొర పెట్టుకున్నాడు.దీంతో
విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేకసార్లు నోటీసులు పంపించినా సుదీప్ గైర్హాజరు కావడంతో
ఆగ్రహం వ్యక్తం చేసిన చిక్కమగళూరు జిల్లా జేఎంఎఫ్సీ కోర్టు సుదీప్పై జామీను రహిత
వారెంట్ జారీ చేసింది.మే22వ తేదీ లోపు సుదీప్ ఆచూకీ తెలుసుకొని కోర్టు ముందు హాజరు
పరచాలని కర్ణాటక రాష్ట్ర పోలీసులను ఆదేశించింది..