కేంద్రంపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రం

కేంద్రంపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రం

న్యూ ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపై భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి వ్యంగ్య ఫోటోని ట్విట్టర్లో జతపరిచారు. ‘రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్లో లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు. అదే రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’ అని అందులో ఎద్దేవా చేసారు. ఈ ఫోటో గతంలోనే వైరలైంది. సుబ్రమణియన్ స్వామి స్వామి ట్వీట్ చేయడంతో మరో సారి ఇది వైరలైంది. నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos