సూళగిరి తాలూకాలో కలెక్టర్ పర్యటన

సూళగిరి తాలూకాలో కలెక్టర్ పర్యటన

సూళగిరి: తాలూకాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు. బి.కుర బరపల్లి వద్ద సన్ మార్క్ ప్రైవేట్ పరిశ్రమ, ప్రభుత్వము కలిసి చేపట్టిన తొమ్మిది ఎకరాల చెరువులో పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం కుంభళం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భోజనాన్ని పరిశీలించారు. ఇంకా అక్కడి అంగన్ వాడి కేంద్రంలో విద్యార్థులకు ఉపాధ్యా యులు పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల చేతి రాతను కలెక్టర్ ప్రశంసించారు .కుంభళం, గొర్రెల దొడ్డి గ్రామాల్లో చెరువుల పూడిక తీత పనులనూ పరిశీలించారు. ఆయన వెంట సూళగిరి తాసిల్దార్ రెజీనా, బిడివోలు విమల్ ,రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos