బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా 26,27లలో సమ్మె

బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా 26,27లలో సమ్మె

న్యూ ఢిల్లీ: ప్రభుత ఆధ్వర్యంలోని బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఈ నెల 25 అర్థరాత్రి నుంచి 27వ తేదీ అర్ధరాత్రి వరకూ సమ్మె కట్టనున్నాయి. దరిమిలా 26, 27,28(నాలుగో శనివారం), 29( ఆదివారం ), దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకులు మూతబడనున్నాయి. ఇతర బ్యాంకుల సేవలకూ విఘాతం కలగనుంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబీఓ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీఓసీ)లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పదింటిని విలీనం చేయనున్నట్లు ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos