ఫిరాయింపులు.. రాజీ ఎత్తుగడ

ఫిరాయింపులు.. రాజీ ఎత్తుగడ

అమరావతి:’లక్షల కోట్ల రూపాయల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు నాయుడు భాజపాతో మళ్లీ సయోధ్యకు తహతహలాడుతున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి శుక్రవారం ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ‘ ముందుగా రాజ్యసభ సభ్యులను పంపించి మార్గాన్ని సిద్ధం చేసుకున్నారు. వీళ్ల ద్వారా భాజపా పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ఎత్తుగడ’అని విమర్శించారు. ‘తెదేపాను ఓడించినందుకే కర్నూలు జిల్లాల్లో అభివృధ్ది పనులు చేపట్టలేదని ఆరు నెలల కిందట చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే. ఎవరి పట్ల వివక్ష ఉండదని సీఎం జగన్ స్పష్టీకరించారు. అవినీతి పరుడు చంద్రబాబు నాయుడుకు, ప్రజా నాయకుడు జగన్‌ కు ఉన్న తేడా ఇదే’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos