లారీపై రాళ్లు-డ్రైవర్ మృతి

లారీపై రాళ్లు-డ్రైవర్ మృతి

శ్రీ నగర్: అనంత్‌నాగ్ జిల్లా జ్రాదిపొరా ప్రాంతంలో ఓ సాధారణ వాహనాన్ని సైనిక వాహనంగా భావించి ఆదివారం ఉదయం కొందరు రాళ్లు రువ్వటంతో ఆ లారీ డ్రైవర్ నూర్‌ మహ్మద్(42) మృతి చెందాడు. నిషేదాజ్ఞల వేళ ఇది సంభవించటం చర్చనీయాంశమైంది. నిందితుల్ని పోలీసులు సోమ వారం తెల్ల వారు జామున అరెస్టు చేశారు. మరో ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాళ్ల గాయాలతో గాయపడిన నూర్ను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos