వారాంతంలో నష్టాలు

వారాంతంలో నష్టాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 136 పాయింట్లు క్షీణించి 39,614 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 11,642 పాయింట్ల వద్ద ఆగాయి. .ఇంట్రాడేలో దేశీయ సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం సెషన్లో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. టాటా స్టీల్, సన్ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే, రిలయన్స్, టీసీఎస్ షేర్లు రాణించాయి. భారతి ఎయిర్ టెల్, మారుతి, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos