కార్మికుల రిలే దీక్షలు ఆరంభం

కార్మికుల రిలే దీక్షలు ఆరంభం

విశాఖ పట్నం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. పరిశ్రమ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే దీక్షలు ఆరంభించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి సంఘీ భావాన్ని తెలిపారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos