ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు : మద్యం ప్రియుల సందడి

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు : మద్యం ప్రియుల సందడి

హొసూరు : లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మద్యం షాపులను పునఃప్రారంభించారు. అందులో భాగంగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి వద్ద మద్యం దుకాణాలను నేడు తెరవడంతో పెద్ద ఎత్తున మద్యం ప్రియులు అక్కడికి చేరుకొని, మద్యం కోసం ఎగబడ్డారు. అత్తిపల్లి సరిహద్దులోని మూడు దుకాణాలలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా మద్యం బాటిళ్ల కోసం ప్రజలు ఎగబడటంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. తరువాత అందరూ క్యూ పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్తిపల్లి సరిహద్దు వద్ద జాతీయ రహదారిలో సుమారు కిలోమీటరు పొడవునా మద్యం ప్రియులు క్యూలో నిలబడి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన షాపులు రాత్రి 7 వరకు కొనసాగుతాయని కర్ణాటక ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos