చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను రద్దు చేయాలని కేంద్రానికి విన్నవిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శాసనసభలో బుధ వారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం దాని గురించి ప్రసంగించారు. ‘2019లో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాం గంలో పేర్కొన్న సెక్యులర్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేదు. దేశంలోని మత సామరస్యానికి ఏమాత్రం దోహదకారి కాదు. దేశంలోని ఐక్యత, మతసామరస్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగం పేర్కొన్న సెక్యు లర్ సిద్ధాంతాలను పరిరక్షిం చేందుకు సీఏఏను రద్దు చేయాలి’ అని పేర్కొ న్నారు.