ఏడాది కాలంగా తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు,దర్శక నిర్మాతలతో పాటు పలు రంగాల ప్రముఖులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు,ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు తేజను టార్గెట్ చేసింది.తేజ అసలు స్వరూపం ఇదేనంటూ ఫేస్బుక్లు పోస్ట్లు చేసి రచ్చ చేసింది.తేజ రాసలీలల వినోదం.తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఎంటి మరి..మరచిపోయావా అంటూ తేజను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన పోస్ట్లు చర్చనీయాంశమయ్యాయి.మరో దర్శకుడు వర్మను ఉద్దేశిస్తూ వర్మకు ఆకు నాకు ఈక ఎవరు ఇంకెవరు తేజం అని,డైరెక్టర్ తేజ గారు మీకు రామ్గోపాల్ వర్మను..నన్ను అనేంత బొమ్మ లేదుగానీ ఫస్ట్ మీ బొమ్మలకు హిట్ ఇవ్వండంటూ రాయలేని పదాలతో కమెంట్స్ చేసింది.హఠాత్తుగా తేజను టార్గెట్ చేయడం వెనుక శ్రీరెడ్డి ఉద్దేశమేంటని లోతులు వెతకగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన గురించి చేసిన వ్యాఖ్యలేనని తెలిసింది.ఆ ఉదంతాన్ని వెనుకనుంచి నడిపింది రామ్గోపాల్ వర్మేనని ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీని ఏమి పీకలేరంటూ శ్రీరెడ్డి,రామ్గోపాల్ వర్మపై విమర్శలు చేశారు.ఇది మనసులో పెట్టుకునే శ్రీరెడ్డి ఇలా పోస్ట్లు చేసినట్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు శ్రీరెడ్డి నిరసన చేసిన సమయంలో తన తదుపరి చిత్రంలో శ్రీరెడ్డి అవకాశం ఇస్తానంటే హామీ ఇచ్చిన తేజ ఇటీవల విడుదల చేసిన సీతలో ప్రామిస్ను నిలబెట్టుకోకపోవడంతో శ్రీరెడ్డి ఇలా తన కక్ష తీర్చుకున్నట్లు చర్చించుకుంటున్నారు.తేజ బండారం బయట పెడతానంటూ పోస్ట్లు చేసిన శ్రీరెడ్డి ఇప్పటివరకు మౌనంగా ఎందుకున్నట్లో?
Repu teja rasaleela vinodham..Taj Banjara lo illy akka tho enty Mari..marchipoyava??
Posted by Sri Reddy on Friday, May 31, 2019