జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విరుచుకుపడే నటి శ్రీరెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేసింది.సైరా ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిరంజీవి భార్య సురేఖతో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన విషయం తెలిసిందే.ఈ మీటింగ్ను ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఫేస్బుక్ ఖాతాలో చిరంజీవిపై కామెంట్లు చేసింది. చిరంజీవి ప్రత్యేకంగా జగన్ను కలవడానికి వెళ్లడంతో అతడిని పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టింది. ‘చిరు సూపర్.. వైఎస్సార్ సీపీ మేమందరం మీకు ఫుల్ సపోర్ట్’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక చిరంజీవి.. జగన్ ని కలవడం పవన్ తట్టుకోలేకపోతున్నాడంటూ కొన్ని మీమ్స్ ని షేర్ చేసింది.అదే సమయంలో వైఎస్ జగన్కు పలు సూచనలు కూడా చేయడం విశేషం. రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా పెట్టుబడులు రాబట్టాలని దీనిపై ఫోకస్ పెట్టాలని ఈ పనిచేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయని సూచించింది. పారిశ్రామిక పురోగతి, వ్యవసాయ రంగా అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముక… పగలు, ప్రతీకారాలు కావని సీఎం జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేసింది. అందమైన హరిత నగరాలను నిర్మించండి.. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురండి.. పర్యాటకాన్ని పెంపొందించండి.. అప్పుడే గొప్ప వ్యక్తులు, సంస్థలు రాష్ట్రానికి తరలివస్తాయని సూచించింది..
Develop beautiful green cities nd technical availability,tourism so that lot of great people nd companies wl shift to our places
Posted by Sri Reddy on Saturday, October 12, 2019