శ్రీరెడ్డి అంటే
తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.క్యాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి
స్పందించిన తీరు చేసిన ఆరోపణలు శ్రీరెడ్డికి అంతటి పాపులారిటీ తెచ్చిపెట్టాయి.తెలుగు
సినీ ప్రముఖులపై మాత్రమే కాకుండా తమిళ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లపై కూడా ఆరోపణలు
చేసి శ్రీరెడ్డి రచ్చకెక్కింది.తెలుగు చిత్ర పరిశ్రమపై, నటీనటులపై చేస్తున్న ఆరోపణలు,శ్రీరెడ్డి
చేష్టలతో విసుగెత్తిన తెలుగు చిత్ర పరిశ్రమ శ్రీరెడ్డిని దూరం పెట్టడంతో చెన్నైకి మకాం
మార్చిన శ్రీరెడ్డి చెన్నైలోని వలసరవాక్కంలోని అన్బు నగర్లో అద్దె ఇంట్లో ఉంటోంది.
క్రమంలో ఈనెల 21వ తేదీన హైదరాబాద్కు వచ్చిన శ్రీరెడ్డి అదేరోజు రాత్రి చెన్నైకి చేరుకుంది.ఈ
సమయంలో శ్రీరెడ్డి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు వ్యక్తులు శ్రీరెడ్డిపై దాడి చేసినట్లు
సమాచారం.సినీ ఫైనాన్షియర్ సుబ్రమణి తన అసిస్టెంట్ గోపితో కలసి తన అపార్ట్మెంట్కు
వచ్చి దాడి చేశారని శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.గతంలో హైదరాబాద్లో ఉన్నపుడు
ఓ కేసులో ఫైనాన్షియర్ సుబ్రమణిని పోలీసులు అరెస్ట్ చేయగా అందుకు నేనేనని భావించిన
సుబ్రమణి తనపై దాడి చేశాడంటూ శ్రీరెడ్డి ఫిర్యాదులో పేర్కొంది.ఇటీవల పొల్లాచ్చిలో వెలుగు
చూసిన అత్యాచారం ఘటనలపై కూడా శ్రీరెడ్డి ఫేస్బుక్లో స్పందించింది.ఈ విషయాన్ని వదలిపెట్టనని
దీనిపై పోరాడడానికే చెన్నై వచ్చానని అందుకే శత్రువులు నాపై దాడి చేశారంటూ ఆరోపించింది..