వీలు చిక్కినప్పుడల్లా నటీనటులపై,రాజకీయ నేతలపై ఏదోఒక ఆరోపణలు,కామెంట్లు చేసే నటి శ్రీరెడ్డి తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.కొద్ది కాలం క్రితం రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన రజనీ అనంతరం పార్టీ గురించి పూర్తిగా వదిలేసి వరుస చిత్రాలతో బిజీగా మారడంతో పార్టీ గురించి ప్రశ్నిస్తూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.’రజినీకాంత్ గారు.. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మైంటైన్ చేయడానికి..మీరు రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? క్లారిటీ ఇవ్వండి’ అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే..పార్టీలో నేను కూడా చేరతానంటూ మరో పోస్ట్ పెట్టింది.పవన్ కళ్యాణ్,నాని,వెంకటేశ్,నాగార్జున కుటుంబ సభ్యులపై ఇలా కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని టార్గెట్ చేసిన ఈమె ఆ తరువాత కోలీవుడ్ పై పడింది. సుందర్ సి, విశాల్ లాంటి ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. వీరంతా సరిపోలేదని అనుకుందో ఏమో రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కామెంట్లు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేసింది.
Legend rajani kanthGaru give the clarity to tamil makkal,r u coming into politics or not?it's not a movie story 2 maintain secret
Posted by Sri Reddy on Friday, October 11, 2019