పాక్‌ గూఢచారి అరెస్టు

పాక్‌ గూఢచారి అరెస్టు

జైపూర్ : గూఢ చర్యానికి పాక్ నుంచి దేశంలోకి చొరబడిన కిషోర్ అనే వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం రాజస్తాన్లోని బర్మేర్లో శుక్రవారం బంధించింది. బీఎస్ఎఫ్, భారత ఆర్మీ కార్యకలాపాల సమాచారాన్ని తెలుసుకునేందుకు తన మేనమామే భారత్కు పంపినట్లు కిశోర్ తెలిపాడని భధ్రతా వర్గాలు తెలిపాయి. సరిహద్దులోని బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ దేశంలోకి చొరబడినట్లు వివరించారు. ‘పాక్ లోని ఖోఖ్రాపర్ వరకు రైలులో వచ్చాను. అక్కడి నుంచి తాను సరిహద్దు దాటేందుకు పాక్ పదాతి దళం సాయపడింద’ని కిషోర్ విచారణలో తెలిపాడన్నారు. విచారణలో పదే పదే మాట మారు స్తున్నందున తదుపరి విచారణ కోసం జైపూర్కు తరలించిటన్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos