అంతర్రాష్ట్ర సంచారంపై ఆంక్షలు

అంతర్రాష్ట్ర సంచారంపై ఆంక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర సంచారం గురించి తదుపరి నిర్ణయాన్ని తీసుకొనేంత వరకు ఆంక్షలు షరతులు కొనసాగుతాయని పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణీకులు ఖచ్చితంగా స్పందన(spandana) పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి. కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్లో ఉండాలి. కరోనా ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు వారం ప్రభుత్వ క్వారంటైన్లో ఉండి కరోనా పరీక్షల్ని చేయించుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos