జెఇఇ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయండి

జెఇఇ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయండి

న్యూఢిల్లీ : కరోనా ఉధృతంగా ఉన్నందున జెఇఇ, నీట్ పరీక్షల్ని వాయిదా వేయాలని వితరణ శీలి, నటుడు సోనూసూద్ కేంద్ర ప్రభుత్వానికి బుధవారం విన్నవిం చారు. ‘నేనూ ఇంజనీరింగ్ విద్యార్థినే. వరదలతో తీవ్రంగా నష్ట పోయిన బీహార్ నుంచి గరిష్ట సంఖ్యలో విద్యార్థులు హాజరవనున్నారు. ఈ సమయంలో వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్ట మౌతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కొంత సమయం ఇవ్వాలి. విద్యార్థులు మానసికంగా సిద్ధమైన అనంతరం నవంబర్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించవచ్చ’ని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos