ఆమె నటి కాదు.. ధన పశువు

ఆమె నటి కాదు.. ధన పశువు

లక్నో : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఉత్తర ప్రదేశ్ అధికారి సునిల్ భరాలా ‘ధన పశువ’ని వ్యాఖ్యానించారు. ‘ఆధునిక కాలంలో ఇలాంటి వారు ధనార్జన గురించి మాత్రమే యోచిస్తారు. సంపాదించిన మొత్తం డబ్బునూ సొంతం కోసమే ఖర్చు పెడతారు. ఇలాంటి వారికి చరిత్ర, దేవుడి గురించి అవగాహన ఉండదు. తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించబోరు. వీరంతా ధన పశువులు. వీరిని చూసి చింతించడం తప్ప ఏం చేయలేమ’ని ధ్వజ మెత్తారు. కౌన్ బనేగా కరోడ్ పతికి హాజరైన సోనాక్షిని కార్యక్రమ నిర్వాహకుడు అమితాబ్ బచ్చన్ ఎవరి కోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు అని ప్రశ్నించారు. సమాధానం కోసం ఆమె ఇతరుల సాయాన్ని కోరింది. సోనాక్షి తీరు పట్ల అమితాబ్ ఆశ్చర్యం పడ్డారు. ‘ మీ ఇంటికి రామాయణం అని పేరు పెట్టుకున్నారు. అన్నిటింకి మించి రాముడి సోదరుల్లో ఒకరి పైరైనా శత్రుఘ్న పేరును మీ తండ్రి పెట్టుకున్నాడు. అయినా నీకు ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా’ని ఎద్దేవా చేసారు.

తాజా సమాచారం