ముక్కలుగా నరికి బకెట్లలో దాచాడు..

ముక్కలుగా నరికి బకెట్లలో దాచాడు..

తాగి వేధిస్తున్నాడని కన్న కొడుకే తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో దాగి ఉంచిన దారుణ ఘటన హైదరాబాద్‌ నగరంలో వెలుగు చూసింది. రైల్వేశాఖలో గూడ్స్‌డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన మహారాష్ట్రకు చెందిన కిషన్‌ సుతార్‌ రెండు దశాబ్దాల క్రితం పదవీ విరమణ పొంది భార్య గయ ఇద్దరు కూతుళ్లు,కొడుకుతో కలసి మౌలాలీలోని ఆర్టీసీ కాలనీలో స్థిరపడ్డాడు.చాలా కాలంగా మద్యానికి బానిసైన సుతార్ ప్రతి రోజు తాగొచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. క్రమంలో నెల 16 తేదీ రాత్రి 10 గంటలకు మద్యం సేవించి వచ్చిన కిషన్.. భార్య, కొడుకు, కూతురితో గొడవపడ్డాడు.రోజురోజుకు కిషన్‌ వేధింపులు ఎక్కువ కావడంతో తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకున్న ప్రపుల్‌ అదే రోజు రాత్రి కిషన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే ఆరు బకెట్లలో దాచి వుంచాడు.కాగాగత రెండు రోజులుగా మారుతీ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులుఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వున్న ఆరు బకెట్లను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos