అమరావతి : ‘రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్న భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి చేసిన వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే భాజపా విధానమ’ని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. రాజధాని పై గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగని గందరగోళం జరుగు తోందని సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు అసమంజసమ’ని పేర్కొన్నారు.