చెన్నై : నిరాడంబర జీవితానికి ధోనీ పెట్టింది పేరని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఐపీఎల్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం రాత్రి చెన్నైలో మ్యాచ్ ఆడింది. తదుపరి మ్యాచ్ గురువారం రాజస్థాన్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ వేదిక జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం. కేవలం ఒకే రోజు వ్యవధి ఉండడంతో కేకేఆర్తో మ్యాచ్ ముగియగానే సీఎస్కే జట్టు సభ్యులు కెప్టెన్ ధోనీతో కలసి హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నారు. విపరీతమైన ఎండలు, మ్యాచ్ అనంతరం తగినంత విశ్రాంతి లేకపోవడంతో ధోనీ, భార్య సాక్షితో కలసి నేలపైనే కునుకు తీశారు. ఈ ఫొటోను ధోనీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. మ్యాచ్ ముగిసిన తెల్లవారు జామునే ప్రయాణమంటే ఇలాగే ఉంటుందని ధోనీ అందులో పేర్కొన్నాడు. ఇక ధోనీపై అభిమానుల ప్రశంసల జల్లు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.