శ్రీలంక చిరస్మరణీయ విజయం

శ్రీలంక చిరస్మరణీయ విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను శ్రీలంక 2-0తో చేక్కించుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ను గెలుచుకున్న తొలి ఆసియా దేశంగా కీర్తి గడించింది. ఆ గడ్డపై సిరీస్ గెలుచుకున్న మూడో జట్టుగా కూడా నిలిచింది. పోర్ట్ ఎలిజబెత్లోని సెయింట్ జార్జ్ పార్కు వేదికగా జరిగిన రెండో టెస్టులో శనివారం శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాట్ చేసిన దక్షిణాఫ్రికా 222 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 128 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో ఒషాడా ఫెర్నాండో (75), కుషాల్ మెండిస్ (85)లు చక్కగా ఆడడంతో ఆ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఒక వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos