పైలట్ వెంట 16 మంది

పైలట్  వెంట 16 మంది

న్యూ ఢిల్లీ : రాజస్థాన్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వెంట 16 మంది శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి విడుదలైన వీడియో దీన్ని స్పష్టీకరించింది. . సోమవారం రాత్రి పైలట్ వర్గం బస చేసిన గురు గ్రామ్లోని మానెసర్ హోటల్లో నుంచి ఈ వీడియోను పర్యాటక మంత్రి విశ్వేంద్ర సింగ్ ట్విటర్లో పోస్టు చేసారు. 10 సెకండ్ల నిడివి గల వీడియోలో 16 మంది శాసన సభ్యులు కనిపిస్తున్నారు. వారిలో ఇంద్రా గుర్జార్, ముఖేష్ భాకర్, హరీష్ మీనా, పీఆర్ మీనాను గుర్తించొచ్చు. సచిన్ అందులో కనిపించలేదు. కుటుంబం అని శీర్షిక పెట్టారు. ‘కాంగ్రెస్లో విధేయత అంటే అశోక్ గహ్లోత్ బానిసత్వం అన్ని అన్నారు. అది మాకు ఆమోదయోగ్యం కాదు’ అని లాదూన్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్ట్వీట్ చేసారు.

తాజా సమాచారం