ముంబై :పాకిస్తాన్ కల్లు తాగిన కోతిలా వ్యవహ రిస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అత్యధిక ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి రావటాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీర్ణించు కోలేక పోతున్నారని పార్టీ పత్రిక – సామ్నా మంగళ వారం సంపాద కీయంలో పేర్కొన్నారు. ‘శాంతి ప్రక్రియ పట్ల ఇమ్రాన్ ఖాన్ చొరవ చూపడం మంచిదే. శని వారం ఇఫ్తార్ విందులో జరిగిన ఘటన శాంతిని నెలకొల్పే దిశగా ఉప కరిస్తుం’దాని ప్రశ్నించారు. ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి హాజరైన అతిధులను వేదిక వెలుపల భద్రతా అధికారులు నిలిపివేసినందుకు భారత్ ఆగ్రహించింది.