మోదీ నోరు విప్పాలి

మోదీ నోరు విప్పాలి

న్యూ ఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించ టాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు. మన సైనికులను చంపడానికి వారికెంత ధైర్యం..? వారు మన భూమిని ఆక్రమించకోవడానికి అంత దుస్సాహసానికి ఒడిగడతారా..? ఇప్పటి వరకు జరిగింది చాలు.అక్కడ ప్రస్తుతం ఏమి జరుగుతోందో తెలియాల’ని డిమాండు చేసారు. 20 మంది భారతీయ సైనికులు అమరు లైనందుకు కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సైనికుల వీరమరణం తనకు చాలా బాధను కలిగించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో తామంతా కలిసికట్టుగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos