అమరావతి రైతులకు పాప్‌ సింగర్‌ మద్దతు..

అమరావతి రైతులకు పాప్‌ సింగర్‌ మద్దతు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా అమరావతి ప్రజలు చేస్తున్న నిరసనలు, ఉద్యమాలకు తాజాగా ప్రముఖ పాప్‌ సింగర్‌ స్మిత మద్దతు పలికారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కొందరు పట్టించుకోవడం లేదని ట్వీట్‌లో స్మిత పేర్కొన్నారు. మాకేందుకులే అని ప్రవర్తించడం సరికాదని సూచించారు. తాను అలా కాదని.. రైతుల బాధను పంచుకుంటూ.. న్యాయం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.రాజధాని కోసం భూములిచ్చానా 29 గ్రామాల రైతులకు తాను అండగా ఉంటానని స్మిత భరోసానిచ్చారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ అమరావతి రైతుల పక్షాన నిలుస్తూ ప్రకటన చేశాడు. వారికి న్యాయం చేయాల్సిందే అని.. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశాడు. టాలీవుడ్ నుండి మొదటి సపోర్టర్ గా నారా రోహిత్ నిలిచాడు. ఇప్పుడు ఆయనతో పాటు ప్రముఖ సింగర్ స్మిత కూడా అమరావతి రైతుల పక్షాన నిలిచింది.ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగే నిరసనలు,జల్లికట్టు గురించి స్పందించే మన తారలు 20 రోజులకు పైగా ప్రజలు,రైతులు రోడ్లపై నిరసనలు చేస్తూ లాఠీఛార్జ్‌లో గాయపడుతున్నా ఒక్క సినీ ప్రముఖుడు కూడా స్పందించకపోవడం బాధాకరం.కాగా రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన స్మితపై అమరావతిలో నీవు ఎంత పెట్టుబడి పెట్టావు.. నీకు ఎంత భూమి ఉంది అంటూ ప్రశ్నిస్తూ కొంతమంది వికృతవ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos