రూ. 42కోట్లు విలువ చేసే బంగారం,వెండి స్వాధీనం

రూ. 42కోట్లు విలువ చేసే బంగారం,వెండి  స్వాధీనం

రాయపూర్: ఇండోర్ రెవెన్యూ ఇంటలిజెన్స్ డైకెర్టరేట్ (డీఆర్ఐ) బృందాలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ. 42 కోట్లు విలువ చేసే బంగారం-వెండి బిస్కెట్లను పట్టుబడ్డాయి. తొలుత రాయ్పుర్లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ బృందాలు.. రాజనందగావ్లోని మోహిని జ్యువెల్లర్స్లో సోదాలు చేశాయి. రాయ్పుర్లో 13కేజీల బంగారం స్వాధీనం చేసుకొని, మోహిని జ్యువెల్లర్స్ నుంచి 4,545 కేజీల వెండి, నాలుగున్నర కేజీల బంగారం, రూ. 32లక్షల నగదు స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపాయి. మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నాయి.రాయ్పుర్కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు 13 కేజీల బంగారాన్ని కోల్కతా నుంచి అక్రమంగా తీసుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos