కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా?

కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా?

గౌహతి : ఛత్తీస్గడ్లో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి గురించి అసోం రచయిత్రి శిఖా శర్మ ఫేసు బుక్లో చేసిన వ్యాఖ్య లు సంచలనమయ్యాయి. ‘జీతం పొందేవారు మృతి చెందేవారిని అమరవీరులుగా గుర్తించొద్దు. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రమా దాల్లో మృతి చెందుతారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు మీడియా! ’ అని స్థానిక భాషలో ఆమె రాసింది. గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి దీనికి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖా శర్మకు వ్యతిరేకంగా ఐపీసీ సెక్షిన్ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. శిఖాశర్మను డిస్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos