పట్నా:‘ఇక్కడ ముస్లింలు 64శాతం మంది ఉన్నారు. ఓవైసీ లాంటి వారి వలలలో పడకుండా మీ బలాన్ని గుర్తెరిగి ఓటు వేయండి. మీరంతా కాంగ్రెస్ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి తారిక్ అన్వర్కు ఓటు వేయాలి. ప్రధాని మోదీని ఓడించాలి’’ అని కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కథియార్ జిల్లాలో సోమవారం చేసిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆక్షేపించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసినట్లు బరసోయ్ పోలీసు చంద్ర ప్రకాశ్ బుధవారం తెలిపారు. సంబంధిత వీడియో అన్ని ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఎన్నికల సంఘం చాలా గంభీరంగా పరిగణిచింది. ఆయన వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని భాజపా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.