‘ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్నా.. మీ ఆశీస్సులు కావాలి’

‘ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్నా.. మీ ఆశీస్సులు కావాలి’

హైదరాబాదు: లవర్ బాయ్- నటుడు సిద్ధార్థ్ ఎనిమిదేళ్ల అనంతరం మొదటిసారి గా ఆయన తెలుగు ప్రేక్షకులను మహాసముద్రం ద్వారా అలరించనున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ -మహాసముద్రం. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. నవంబర్ నుంచి జరగనున్న చిత్రీకరణలో సిద్ధార్థ్ పాల్గొననున్నాడు. ‘ఎనిమిదేళ్ల అనంతరం మొదటిసారి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నా. వచ్చే నెల నుంచి సెట్లో అడుగుపెట్టనున్నా. అద్భుతమైన టీమ్తోపాటు మంచి సహనటులతో పనిచేయనున్నా. చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు కావాలి’అని సిద్దార్థ్ ట్విట్టర్లో తెలుగు వారిని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos