మొహాలి
: శుభ్మన్ గిల్ సరైన సమయంలో జట్టును విజయ తీర్చాలకు చేర్చాడు. మొహాలిలో శుక్రవారం
రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గిల్ 65 పరుగులు చేయడమే కాకుండా
చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ కోల్కతా చేజారిపోకుండా జాగ్రత్త పడ్డాడు. మ్యాన్
ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాక గిల్ మ్యాచ్ చూడడానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడాడు.
తాను అర్ధ శతకం చేశాక మీరు సంబరాలు చేసుకున్నారట కదా, ఎలాంటి సంబరాలు అంటూ వాకబు చేశాడు.
తాను లేచి డ్యాన్స్ చేశానని తండ్రి చెప్పాక, నువ్వు చూడలేదా అని గిల్ను తల్లి ప్రశ్నించారు.
తాను క్రీజులో ఉన్నప్పుడు బ్యాటింగ్పైనే దృష్టి పెడతానని సమాధానమిచ్చాడు. అంతకు ముందు
అవార్డు అందుకున్నప్పుడు గిల్ మాట్లాడుతూ తాను ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు మైదానంలోనే
ఉన్నారని, తన గ్రామం నుంచి చాలా మంది బంధువులు కూడా మ్యాచ్ చూడడానికి వచ్చారని తెలిపాడు.
కాగా కేకేఆర్ చివరి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడాల్సి ఉంది. అందులో విజయం సాధిస్తే
ప్లేఆఫ్లో చోటు ఖాయమవుతుంది.