దశాబ్ద కాలం క్రితం వెండితెరకు పరిచయమైన కమల్హాసన్ తనయురాలు శృతి హాసన్ హిందీతోపాటు తెలుగు,తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారింది.లండన్కు చెందిన మైఖెల్ కోర్సెల్తో పీకల్లోతు ప్రేమలో మునిగిన శృతి హీరోయిన్గా కెరీర్గా పీక్లో ఉండగానే సినిమాలకు టాటా చెప్పి లండన్లో మైఖేల్తో కలసి రాక్బ్యాండ్ ప్రారంభించింది.కొద్ది కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగిన శృతి,మైఖెల్ పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి.అంతలోనే తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన షాకిచ్చారు.ప్రేమ విఫలం కావడంపై శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మైఖేల్ తో బ్రేకప్ జరిగిందని తెలియగానే తన సన్నిహితులంతా శృతి హాసన్ ఏంటి ఎలా చేస్తోంది అని అనుకున్నారు. కానీ మైఖేల్ నుంచి విడిపోవడం నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చేలా పెద్ద వ్యవహారమే జరిగినట్లు శృతి మాటలని బట్టి తెలుస్తోంది.జీవితం పెర్ఫ్యూమ్ లాంటిది అంటూ వేదాంతం చెప్పడం మొదలుపెట్టింది. ఒకేసారి పలు రకాల పెర్ఫ్యూమ్స్ వాసనలు చూస్తే ఏది ఏ వాసనొ అర్థం కాదు. తన ప్రేమ వ్యవహారం కూడా అలాగే జరిగిందని శృతి హాసన్ తెలిపింది. ప్రస్తుతం శృతి హాసన్ తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది.