బాబు ‘సోకు’లకే సొమ్ము ఖాళీ

బాబు ‘సోకు’లకే సొమ్ము ఖాళీ

అమరావతి: గత పాలకులు సోకులూ, సింగారాలకే ప్రజా ధనాన్ని దుబారా చేసారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ఏ ఫంక్షన్ నిర్వహించినా ప్రకటనలకు, స్నోలు, పౌడర్లు, సోకులకు కోట్ల రూపాయలు దుబారా చేశారు. నేను బాధ్యతలు స్వీకరించే సమయానికి పురపాలక శాఖ బకాయిలు రూ.15 వేల కోట్లు. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా’అని ప్రశ్నించారు. రహదారుల పై మనుగడ సాగించే అనాథల కోసం స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామ సచివాలయాల ఆలోచన తెదేపాకు వస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆస్పత్రులు ఉన్నచోటే క్యాంటీన్లు పెట్టాలనేది తమ ఆలోచనన్నారు. జీతభత్యాలు ఇవ్వడం కూడా కష్టంగానే ఉందన్నారు. ఇప్పటి వరకు పాత బకాయిలు చెల్లించడానికే సరిపోయిం దని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos