సూలగిరిలో భయం … భయం

సూలగిరిలో భయం … భయం

హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరిలో కరోనా భయంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుండి ఒక కుటుంబం, విల్లుపురం నుండి కొంత మంది సూలగిరికి వచ్చినట్లు సమాచారం. తదనంతరం సూలగిరిలోని కామరాజ్ నగర్, అన్నా నగర్, బజార్ స్ట్రీట్ తదితర ప్రాంతాలను అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకుని పురుగుల మందు పిచికారి చేయిస్తున్నారు.

విల్లుపురం, బెంగళూరు నుండి వచ్చిన కుటుంబీకులకు రక్త పరీక్షలు చేసేందుకుగాను వారి రక్తాన్ని సేకరించి ల్యాబ్ కు పంపించారు. వారు ఎవరెవరితో కలిశారనే పూర్తి వివరాలను అధికారులు సేకరించి, వారిని కూడా క్వారంటైన్ చేసి ఇళ్లలోనే ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అన్నా నగర్,  కామరాజ్ నగర్‌లను  సీల్ డౌన్ చేయడంతో సూలగిరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos