న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ హామీ పేదల్ని బాగా ప్రభా వితం చేసిందని భాజపా లోక్సభ సభ్యుడు రమేశ్ బిదూరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కిం పులో ఆప్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకున్న పోతున్న దశలో ఈ వ్యాఖ్యలు చేశారు.‘200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడితే బిల్లు చెల్లించక్కర్లేదంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటన పేదలపై ప్రభావం చూపించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాజపా కార్యకర్తలు విజయవంతమైతే భాజపా మం చి ఫలితాలను రాబడుతుంది. లేని పక్షంలో కేజ్రీవాల్ పథాకానికి ప్రాముఖ్యం లభిస్తుంద’ న్నారు.