తెలగాంణ రాష్ట్ర
సమితి పార్టీకి మరోషాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి
నియోజకవర్గం టికెట్ ఇస్తానని పార్టీలో చేర్చుకొని ఎన్నికలు సమీపించాక టికెట్ ఇవ్వకుండా
కేసీఆర్ మొండిచేయి చూపారని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం వివేక్ తెరాసకు గుడ్బై
చెప్పిన విషయం తెలిసిందే.తాజాగా వివేక్ బాటలోనే మహబూబ్నగర్ తెరాస ఎంపీ జితేందర్రెడ్డి
కూడా నడవనున్నట్లు సమాచారం.లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి
గురైన జితేందర్రెడ్డి తెరాసను వీడడానికి సిద్ధమైనట్లు సమాచారం.పైకి తెరాసను వీడనుంటూనే
సోమవారం రాత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తో సమావేశమవడం తెరాస వీడనున్నారనే
వార్తలకు ఊతమిస్తున్నాయి.మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఫైర్బ్రాండ్
డీకే అరుణను అభ్యర్థిగా బరిలో దించిన బీజేపీ డీకే అరుణను గెలిపించుకోవడానికి పావులు
కదుపుతోంది.ఈ నేపథ్యంలోనే స్థానికంగా బలమైన నేతగా గుర్తింపున్న జితేందర్రెడ్డిని పార్టీలోకి
తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..