తీర్పు వాయిదా-అధికారులకు షాక్

తీర్పు వాయిదా-అధికారులకు షాక్

న్యూ ఢిల్లీ : తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు నగదు బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని విజయ్ మాల్యా దాఖలు చేసిన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పును వాయిదా వేసింది. న్యాయమూర్తులు యూయూ లలిత్, అశోక్ భుషణ్లతో కూడిన ధర్మాసనం మల్య డబ్బు కొల్లగొట్టి, ఆస్తులను వెల్లడించ లేదని అభిప్రాయపడింది. గత మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఈ ఏడాది జూన్లోనే ఆదేశించింది. ఈ వ్యాజ్యానికి సంబంధించిన దస్త్రాల్ని చూసిన అధికారుల అందరి వివరాలు అందించాలని ధర్మాసనం ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos