హొసూరు : పట్టణ పరిధిలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోని భారతిదాస్ నగర్కు చెందిన బాబు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నాడు. నిర్మాణ పనులలో భాగంగా హొసూరుకు చెందిన రహ్మత్, బిహార్ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు యువకులు ఇంటికి ఇనుముతో తయారు చేసిన వస్తువులను లారీలో నుంచి దించుతుండగా సమీపంలోని హై వోల్టేజ్ లైనుకు తగిలాయి. ఈ సంఘటనలో ముగ్గురూ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వారిని హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రహమత్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.