భారతీయులు ప్రయాణిస్తున్న ఓడ అపహరణ

భారతీయులు ప్రయాణిస్తున్న ఓడ అపహరణ

న్యూ ఢిల్లీ: 15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ అయ్యిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. లైబీరియన్ జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరం సమీపంలో హైజాక్ చేయబడిందని వెల్లడించారు. సమాచారం అందుకున్న భారత నావికాదళం హైజాక్కు గురైన ఓడ ‘ఎంవీ లిలా నార్ఫోక్’ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఇండియన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ ఆ ఓడపై నిఘా ఉంచిందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆ సిబ్బందితో కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ సైనిక అధికారి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos