ఢిల్లీ : ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎంఐ డాట్ కామ్లలో జరుగుతున్న ఫెస్టివ్ సేల్లో చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఆ సంస్థ నుంచి వచ్చిన ఎంఐ టీవీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 2.50 లక్షలకు పైగా ఎంఐ టీవీలను విక్రయించినట్టు షియోమీ తెలిపింది. ప్రతి నిమిషానికి 43 ఎంఐ టీవీలను విక్రయించినట్టు పేర్కొంది. ఈ స్థాయిలో అమ్ముడు పోవడం కంపెనీకి ఇదో మైలురాయిలాంటిందని వివరించింది. గతంలో షియోమీకి చెందిన ఎంఐ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోగా, ఈసారి ఆ సంస్థకు చెందిన టీవీలు పెద్దమొత్తంలో అమ్ముడుపోవడం గమనార్హం.